మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పిలుపునిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.