Tuesday, March 21, 2023

ericsson layoffs, Layoffs: ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. 8,500 మందిని పీకేసిన మరో సంస్థ.. భారత్‌లోనూ ప్రభావం! – tech layoffs 2023 ericsson to lay off 8500 employees says memo


Layoffs 2023: ఆర్థిక మాంద్యం భయాల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలై గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటివి వేలాది మందిని తొలగించాయి. ఒక్క 2023లోనే లక్ష మందికిపైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయింది టెలికాం పరికరాలు తయారు చేసే కంపెనీ ఎరిక్సన్ (Ericsson Layoffs). వేలాది మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సంస్థ ఉద్యోగుల్లో మొత్తం 8,500 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాలు తయారు ఈ బహుళ జాతి సంస్థ లేఆఫ్స్‌తో మరోసారి ఉద్యోగులు భవిష్యత్తుపై చర్చ కొనసాగుతోంది.

వ్యయ నియంత్రణ పేరుతో ఎరిక్సన్ (Ericsson) ఉద్యోగాల తొలగింపు చర్యలు చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లేఆఫ్స్‌లో భాగంగా ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు కంపెనీ మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోతున్న వారి సంఖ్య దేశాన్ని బట్టి మారుతుంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) బోర్జే ఎకోల్మ్ తెలిపారు. ఏయే దేశాల్లో ఎంత మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నామనే వివరాలను ఇప్పటికే కొన్ని దేశాలకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ఖర్చులు తగ్గించునే చర్యల్లో భాగంగా టెలికాం పరికరాల తయారీ కంపెనీ ఎరిక్సన్ ఇటీవలే స్వీడన్‌లో 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. ఆయా తొలగింపులకు తాజా ప్రకటన అదనంగా తెలుస్తోంది. అప్పటి లేఆఫ్స్‌తో కలుపుకొని దాదాపు 10 వేల మందిని ఎరిక్సన్ ఉద్యోగాల్లోంచి తీసేసినట్లు స్పష్టమవుతోంది. భారత్‌లోనూ ఎరిక్సన్ కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగులపైనా లేఆఫ్స్ ప్రభావం ఉండనుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఎరిక్సన్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 1,05,000 మంది ఉద్యగులు పని చేస్తున్నారు. అయితే, తాజా లేఆఫ్స్ వల్ల ఏ దేశంలోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారనే అంశాన్ని ఎరిక్సన్ వెల్లడించలేదు. కానీ, ఉత్తర అమెరికాలోని దేశాల్లో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధిపతంలో ఉన్న భారత్ వంటి దేశాల్లో ఈ ఉద్యోగాల కోతలు తక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 2023 చివరి నాటికి 9 బిలియన్ క్రౌన్స్ (880 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు తగ్గించుకుంటామని గత ఏడాది డిసెంబర్‌, 2022లోనే ప్రకటించింది ఎరిక్సన్ సంస్థ. అందులో భాగంగానే 10 వేల మందికిపైగా ఉద్వాసన పలికినట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులోనూ మరిన్ని కోతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగులూ ఊపిరి పీల్చుకోండి.. ఇక Layoffs తక్కువేనటా.. కానీ IT సీనియర్లకు.!లేఆఫ్స్ వేళ Google మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఇక తప్పదు.. ఏం చేసిందంటే?రోబోలు సైతం జీతం అడిగాయేమో? ఉద్యోగంలోంచి పీకేసిన Google.. కారణం ఏం చెప్పిందంటే?



Source link

Latest news
Related news