Friday, March 31, 2023

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి-stones pelted at chennai mysuru vande bharat train in bengaluru


Vande Bharat train: సీరియస్ యాక్షన్

వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్సపై రాళ్ల దాడులు చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రాళ్ల దాడులు చేసిన వారికి నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించింది. శనివారం మైసూరు – చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్ పై గుర్తు తెలియని దుండగులు చేసిన రాళ్ల దాడి వలన రెండు కిటీకీల అద్దాలు ధ్వంసమయ్యాయని సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) ప్రకటించింది. ప్రయాణీకులెవరూ గాయపడలేదని, ఈ దాడికి పాల్పడిన వారికి గుర్తించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. జనవరి నెలలో సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) పరిధిలో 21 రాళ్ల దాడుల ఘటనలు జరిగాయి. ఫిబ్రవరిలో బెంగళూరు డివిజన్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి.



Source link

Latest news
Related news