‘వీరసింహా రెడ్డి’ సినిమా గురువారం సాయంత్రం నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, విడుదలైన ఒక్క నిమిషంలోనే 150K పైగా యూనిక్ వ్యూయర్స్ ఈ చిత్రాన్ని చూసినట్లు సమాచారం. ఇది తెలుగు OTT చరిత్రలోనే సరికొత్త రికార్డ్. ఈ లెక్కన త్వరలోనే OTT వేదికగా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని బాలయ్య ఫ్రాన్స్తో పాటు ఎనలిస్ట్లు అంచనా వేస్తున్నారు.
బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో శ్రుతి హాసన్తో పాటు హనీ రోజ్ హీరోయిన్గా నటించింది. అలాగే స్టార్ యాక్టర్ దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్, లాల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య గెటప్తో పాటు డైలాగ్స్, డాన్సులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో #NBK108 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలవనుంది. నిజానికి ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి కుమారుడు తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ విషాదంలో ఉంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పైగా తారకరత్నతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఆయన గుండె పోటుతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ‘అన్స్టాపబుల్ టాక్ షో’ సీజన్2ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు బాలయ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన చివరి ఎపిసోడ్కు అభిమానుల నుంచి మంచి అప్లాజ్ లభించింది.
- Read Latest Tollywood Updates and Telugu News