Modi great man: మోదీ గొప్పవాడు
‘‘భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయి ఉండకపోతే బావుండేదనిపిస్తోంది. భారత్ నుంచి విడిపోయి ఉండకపోతే ఇక్కడ కూడా టమాటాలు కిలో రూ. 20కి, చికెన్ కిలో రూ. 150 కి, పెట్రోల లీటర్ రూ. 50కి లభించేది’ అని ఆ వ్యక్తి అనడం ఆ వీడియోలో రికార్డైంది. ‘‘పాకిస్తాన్ కు ఇప్పుడు భుట్లో, షరీఫ్, ఇమ్రాన్, ముషారఫ్.. ఎవరూ అవసరం లేదు. మాకు మోదీ కావాలి. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది. పాకిస్తాన్ విడిపోయి ఉండకపోతే, మేం కూడా మోదీ పాలనలో ముందుకు వెళ్లేవాళ్లం’’ అని ఆ యువ పాకిస్తానీ అనడం సంచలనంగా మారింది. ‘‘మోదీ చెడ్డవాడేం కాదు.. ఆయన గొప్పవాడు. ఆయన పాలనలో భారతీయులు చవగ్గా టమాటాలు, చికెన్ కొనగలుగుతున్నారు. మాకు కూడా మోదీని ప్రధానిని చేయమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆ యువకుడు వ్యాఖ్యానించాడు.