గుజరాత్లో కాషాయ పార్టీ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్త అభ్యర్థులు గెలుపొందడంతో వ్యూహం ఫలించింది. అయితే బొటాడ్, వాఘోడియాలో కొత్త అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బొటాడ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంధన శాఖ మాజీ మంత్రి సౌరభ్ పటేల్ను పక్కనబెట్టి ఘనశ్యామ్ విరానీని బీజేపీ బరిలోకి దింపింది. పటేల్ 1998, 2002, 2007, 2017లో ఈ సీటును గెలుచుకున్నారు. 2012లో బీజేపీకి చెందిన టీడీ మానియా ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. విరానీ ఆప్కి చెందిన ఉమేష్ మక్వానా చేతిలో 2,779 ఓట్ల తేడాతో ఓడిపోయారు.