ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని సజ్జల స్పందించారు. విభజనకు వ్యతిరేకంగా మెుదటి నుంచి వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్(Congress), టీడీపీ పార్టీలు.. విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనను బలంగా వినిపిస్తామని, లేకుంటే.. సరిదిద్దాలని గట్టిగా అడుగుతామని స్పష్టం చేశారు సజ్జల. విభజన చట్టంలోని హామీల అమలుపై ఇప్పటి పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలి అని సజ్జల కామెంట్స్ చేశారు.
BREAKING NEWS