Sunday, April 2, 2023

PAK Vs ENG: ఇంగ్లాండ్ టీమ్ ఉన్న హోటల్ సమీపంలో కాల్పులు

పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటు చేసుకుంది. పాక్‌ -ఇంగ్లాండ్‌ మధ్య నేడు (డిసెంబర్ 9) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. రెండో టెస్టు నిమిత్తం ముల్తాన్‌‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టు.. అక్కడ ఓ హోటల్‌లో దిగింది. ఆ హోటల్‌కు సమీపంలో గురువారం కాల్పుల శబ్దం వినిపించినట్లు పాక్ మీడియాలో వార్తా కథనాలు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

హోటల్‌కు కిలోమీటర్‌ దూరంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని.. లోకల్ గ్యాంగ్స్ మధ్య ఈ కాల్పులు జరిగాయని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారని రాశారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

గతంలో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం ఆ దేశంలో పర్యటించేందుకు ఇతర జట్లు ముందుకురాలేదు. చాలా కాలం తర్వాత తిరిగి శ్రీలంక జట్టే మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్టింది. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డమీద టెస్టు క్రికెట్ ఆడేందుకు గత నెలలో ఇంగ్లాండ్ జట్టు అక్కడికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగించింది. అయితే, పాక్‌‌లో పర్యటించే జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.

ఇక రెండో టెస్టు తొలి రోజు మొదటి సెషన్ ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు (26 ఓవర్లలో) చేసింది. ఓలీ పోప్ 50 హ్యారీ బ్రూక్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.. తిరిగివ్వాలి కదా, పాక్ పట్ల బెన్ స్టోక్స్ పెద్ద మనసు

Latest news
Related news