బుధవారం ఇన్స్టా వేదికగా జాన్వీ సంబంధిత చిత్రాలను పోస్ట్ చేసింది.. ఈ మేరకు రకరకాల స్టిల్స్లో ఆమె ప్రదర్శించిన హావభావాలు హాట్నెస్కు కేరాఫ్గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. చురకత్తుల్లాంటి చూపులతో తన క్లీవేజ్ మీద చెయ్యి వేసిన ఒక పిక్.. ఈ ఫొటో షూట్కే హైలైట్గా నిలిచింది. ఈ అట్రాక్టివ్ క్లిక్స్లో జాన్వీ కపూర్ హాట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక సెక్షన్ జనాలు మాత్రం ఈ ఫొటో షూట్పై నెగెటివ్గా కామెంట్ చేశారు. ‘చీటికి మాటికి క్లీవేజ్ ప్రదర్శనలు మాని.. యాక్టింగ్పై ఫోకస్ చేస్తే మంచిది’ అని సూచిస్తున్నారు. ఇక మరొకరు నెటిజన్ ఇవన్నీ ‘చీప్ ట్రిక్స్’ అంటూ చురకలంటించాడు.
అయితే, జాన్వీ ఫొటో షూట్ను తన క్లోజ్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రామణి, రూమర్డ్ బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా మాత్రం అభినందించారు.
సినిమాల విషయానికొస్తే.. శరణ్ శర్మ దర్శకత్వంలో అప్కమింగ్ రొమాంటిక్ కామెడీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో కనిపించనుంది జాన్వి. ఇందులో రాజ్కుమార్ రావుతో రొమాన్స్ చేయనుంది. ఇది కాకుండా ‘బవాల్’ చిత్రంలో వరుణ్ ధావన్తో జతకట్టనుంది.
ఇక అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వి.. 2018లో వచ్చి ‘దఢక్’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లఖ్ జెర్రీ, ’ చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. వీటిలో గుడ్ లఖ్ జెర్రీ చిత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్ ‘కోలమావు కోకిల’ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఇదిలా ఉంటే.. ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్’సినిమాకు బెస్ట్ లీడింగ్ రోల్ యాక్ట్రెస్గా 2020లో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న జాన్వి.. చివరగా ‘మిమి’ చిత్రంలో కనిపించింది.
- Read Latest Telugu Movies News , Telugu News