బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ.. జట్టు ఓటమి అంచులో నిలిచినప్పుడు బ్యాటింగ్కు దిగాడు. బొటన వేలికి గాయమై.. రక్తం కారుతున్నప్పటికీ బాధను పంటి బిగువనే అనుభవిస్తూ.. బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ 28 బంతుల్లో 51 పరుగులు చేసి భారత్ను దాదాపుగా గెలిపించినంత పని చేశాడు. గెలుపు కోసం చివరి బంతి వరకూ వీరోచితంగా పోరాడిన రోహిత్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.