ఈ సందర్భంగా మహేష్, అతని వైఫ్ నమ్రత, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందరూ కలిసి టేస్టీ హోమ్ ఫుడ్ను ఆస్వాదించారు. ఇక ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను నమ్రత తన ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. అంతేకాదు ‘నా బిగ్ డ్రీమ్ సిటీలో లిటిల్ మూమెంట్స్.. బెస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ అందించిన షాజియాకు థాంక్స్’ అనే నోట్కు #Mumbai #Friends #Homefood హ్యాష్ టాగ్స్ యాడ్ చేసింది.
కాగా.. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, నమ్రతకి చాలా క్లోజ్ ఫ్రెండ్. మహేష్ నటించిన అనేక కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ షూట్స్ను అతనే చిత్రీకరిస్తాడు. అయితే గత రాత్రి.. అవినాష్, అతని భార్య షాజియా, దర్శకుడు మెహర్ రమేష్తో కలిసి #SSMB28 టీమ్కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ మేరకు మహేష్, త్రివిక్రమ్, తమన్.. ఈ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఇంట్లో ఇంట్లో భోజనం చేస్తూ కనిపించారు.
ఇక SSMB28 చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మహేష్కు జంటగా నటించనుంది. వీరిద్దరూ గతంతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ చిత్రంలో కలిసి పనిచేశారు. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేయనున్నారు. దీని తర్వాత మహేష్.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో తదుపరి మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి గతంలో మాట్లాడిన ప్రిన్స్.. అప్పుడే రాజమౌళితో సినిమా గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. కానీ రాజమౌళితో ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్న తన కోరిక నెరవేరనుందని.. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్గా ఎదురుచూస్తున్నానని తెలిపారు. కాగా ఈ SSMB28 కథకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ప్రేరణ పొందినట్లు మేకర్స్ ధృవీకరించారు.
- Read Latest Telugu Movies News , Telugu News