‘స్ఫూర్తిదాయకం’
Parliament Winter Session: “సభతో పాటు దేశం మొత్తం తరఫున నేను చైర్మన్కు అభినందనలు తెలుపుతున్నా. ఎన్నో కష్టాలను అధిగమించి మీరు (జగ్దీప్ ధన్కర్) ఈ స్థానానికి చేరుకున్నారు. దేశంలోని చాలా మందికి ఇది ఎంతో స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ అన్నారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్.. తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానాన్ని అధిష్టించారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ఇవే. అలాగే, జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు రావడం గొప్ప అవకాశమని, దేశానికి అమృతకాలం మొదలైందని మోదీ వ్యాఖ్యానించారు.