Monday, October 2, 2023

maruti suzuki recalls, Maruti Suzuki: వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. మంచి డిమాండ్ ఉన్నా.. ఇప్పుడేం సమస్య వచ్చింది? – maruti suzuki recalls 9,125 units of ciaz, brezza, ertiga and others: here’s why


Maruti Suzuki: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వివిధ మోడళ్లకు చెందిన తమ కార్లను రీకాల్ చేసింది. ఏకంగా 9,125 యూనిట్లను వెనక్కి పిలిపించింది మారుతీ కంపెనీ. అయితే 2022 నవంబర్ 2 నుంచి నవంబర్ 28 మధ్య తయారైన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ 9 వేల కార్ల మోడళ్లలో సియాజ్ (Ciaz), బ్రెజ్జా (Brezza), ఎర్టిగా (Ertiga), XL6, గ్రాండ్ విటారా (Grand Vitara) ఉన్నాయి. అయితే మారుతీ సుజుకీ కార్ సేల్స్ ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయినా ఇప్పుడు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ రీకాల్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?

కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ముందు వరుస సీట్లలో కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో సమస్య తలెత్తి ఉండొచ్చని అంటోంది. షోల్డర్ హైట్ అడ్జస్టర్ అసెంబ్లీలో చైల్డ్ పార్ట్స్‌లో ఈ ప్రాబ్లం ఉండొచ్చని చెబుతోంది. అయితే ఈ లోపం సీట్లను ఓపెన్ చేసి చూడాల్సి వస్తుందని చెబుతోంది. అందుకే రీకాల్ చేసినట్లు వెల్లడించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..

‘మా కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని.. కార్లను రీకాల్ చేయాల్సి వచ్చింది. సమస్య ఉన్నట్లు అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేసి రీప్లేస్‌మెంట్ చేస్తాం. దీనికి ఎలాంటి ఛార్జీలు అడగం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్.” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఉన్నాయని భావిస్తున్న కార్ల యజమానులకు.. మారుతీ సుజుకీ గుర్తింపు పొందిన వర్క్‌షాప్స్ నుంచి సమాచారం అందుతుందని, అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవచ్చని పేర్కొంది.

Also Read: Hyd: గోల్డ్ ఏటీఎం.. ఇలా బంగారం కాయిన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు

ఇదిలా ఉంటే మరోవైపు.. ఇటీవల మారుతీ సుజుకీ మరో కీలక ప్రకటన చేసింది. ఎంపిక చేసిన తమ వేర్వేరు మోడళ్లపై వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో అన్ని కమోడిటీస్ ధరలు పెరిగాయని, ముడిభాగాలు కొనాలన్నా తమపైనే భారం పడుతుందని కంపెనీ వివరించింది. అందుకే రేట్లు పెంచాల్సి వస్తోందని స్పష్టం చేసింది మారుతీ సుజుకీ.

Also Read: 400 శాతం రిటర్న్స్ ఇచ్చిన అసలైన మల్టీబ్యాగర్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..

ఇంకా కొత్త సంవత్సరానికి కొద్ది రోజులు ఉన్నవేళ చాలా కార్ల తయారీ కంపెనీలు.. తమ సేల్స్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో మహీంద్రా, మారుతీ సుజుకీ ఒకవైపు ఈ డిసెంబర్‌లో డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఎంపిక చేసిన వివిధ వేరియంట్లపై తగ్గింపు అందిస్తున్నట్లు చెబుతున్నాయి. మరోవైపు.. వచ్చే ఏడాది జనవరి నుంచి రేట్లు పెంచుతామని పేర్కొంటున్నాయి.

Also Read: లక్షల్లో ఉద్యోగులు.. భారత్‌లో టాప్-10 కంపెనీలివే.. అంబానీకి చోటు.. అయ్యో అదానీ!



Source link

Latest news
Related news