వసీం ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు అక్షయ్. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ను షేర్ చేస్తూ మొదటి షూటింగ్ షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో ఈ యాక్షన్-పీరియడ్ డ్రామాపై హైప్ క్రియేట్ అయినప్పటికీ.. తన గత చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ పరాజయంపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు అక్షయ్ను దారుణంగా ట్రోల్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ మరాఠీ పీరియడ్ డ్రామా పోస్టర్ షేర్ చేసిన అక్షయ్.. ‘ఈ రోజు మరాఠీ చిత్రం ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నాను, ఇందులో నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్ర పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి’ అని పోస్టు చేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే, నెటిజన్లు తనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్ర మాదిరే ఇది కూడా చేయొద్దు అంటూ స్పందిస్తున్నారు.
నిజానికి ఈ ఏడాది జూన్ 3న విడుదలైన అక్షయ్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ మూవీ.. రాజపుత్ర చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, కాలాల ఆధారంగా 18 ఏళ్ల పరిశోధన తర్వాత రూపొందించబడింది.
ఇక మహేష్ మంజ్రేకర్తో అక్షయ్ అప్కమింగ్ మూవీ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ విషయానికొస్తే.. ఇందులో జే దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2023 దీపావళి కానుకగా మరాఠీ, హిందీ, తమిళం & తెలుగు భాషల్లో విడుదల కానుంది.
- Read Latest Telugu Movies News , Telugu News