Sachin Pilot vs Ashok Gehlot: భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్తాన్ లో కొనసాగుతోంది. ఈ యాత్రను విజయవంతం చేస్తామని ఈ మధ్య ఒకే వేదికపై నుంచి పైలట్, గహ్లోత్ లు స్పష్టం చేశారు. అంతకుముందు, ఇద్దరు నేతలు రాహుల్ ను ప్రత్యేకంగా కలిశారు. పార్టీ రాష్ట్ర శాఖలో విబేధాల వల్ల భారత్ జోడో యాత్ర విఫలం కాకూడదని రాహుల్ ఆ నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో విబేధాలపై బీజేపీ విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. ‘‘రాజస్తాన్ బీజేపీలో ఇప్పుడు కనీసం 10 మంది తామే కాబోయే సీఎంలమని అనుకుంటున్నారు’’ అని పైలట్ ఎద్దేవా చేశారు.